‘భరత్’ని ఎంజాయ్ చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ‘భరత్ అనే నేను’ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈ చిత్రంలో తొలిసారిగా మహేష్‌బాబు ముఖ్యమంత్రి క్యారెక్టర్‌ని పోషించారు. ఈ సినిమాను చూసి వ్యక్తిగతంగా ఎంతగానో ఎంజాయ్ చేశానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మీరు నన్ను సర్‌ప్రైజ్ చేయడానికి వచ్చారు. పబ్లిక్ లైఫ్ గురించి, ‘్భరత్ అనే నను’ సినిమా గురించి నా మంచి స్నేహితుడు మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివతో చర్చించా. ఈ సినిమా చూసి వ్యక్తిగతంగా ఎంజాయ్ చేశా అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్‌బాబుతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. వీటితో పాటు చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. దీనికి మహేష్‌బాబు స్పందిస్తూ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ‘మా చిత్రాన్ని చూసి మీరు ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా వుంది. మా కార్యక్రమంలో భాగమైనందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా నటించిన ఈ చిత్రంలో అతడి సరసన ఖైరా అద్వానీ కథానాయికగా నటించింది. ‘ప్రతి ఒక్కరిటీ భయం, భద్రత ఉండాలి.., ఇచ్చిన మాటపై నిలబడాలి’ అంటూ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భరత్ అనే నేను’ అన్ని వర్గాలను అలరించడమేగాక, విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.