నేల టిక్కెట్టుకు పవన్ గిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్‌రాజా రవితేజ - కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్‌లో ‘నేల టిక్కెట్టు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌టి మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఇందులో మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోండగా జగపతిబాబు, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘్ఫదా’ ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కె ప్రసాద్ కూర్పు, బ్రహ్మకడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మే 24న చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే చిత్రం ఆడియో వేడుక మే 12న జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పలు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన దర్శకుడు త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడిస్తామని అన్నారు. అన్నట్టుగానే దర్శకుడు తన ట్విట్టర్ ద్వారా నేల టిక్కెట్టు ఆడియో వేడుకకి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరు అవుతున్నారని తెలిపాడు. మే 10న ఆడియో వేడుక కార్యక్రమం జరగనుందని అభిమానులకి క్లారిటీ ఇచ్చారు. రవితేజ మూవీ ఆడియో వేడికకి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వస్తున్నారని చెప్పడంతో ఇద్దరు హీరోల అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.