ఒక రాధా ముగ్గురు కృష్ణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌సిసి సమర్పణలో ధృవ ఆర్ట్స్ పిలిమ్స్ పతాకంపై అభిషేక్, అభి, డి.ఆకాష్ మరియు అనూష వేణుగోపాల్ హీరో హీరోయిన్‌గా పరకోటి బాలాజీ దర్శకత్వంలో ధృవచరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘ఒక రాధ ముగ్గురు కృష్ణులు’. ఈ చిత్రం ఆడియో వేడుక ఫిలింనగర్‌లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేష్ కొండేటి, ముత్యాల రాందాస్, శ్రీరంగం సతీష్‌కుమార్, మోహన్‌గౌడ్ మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు సీడీని విడుదల చేసి దర్శకుడు పరకోట బాలాజీకి, నిర్మాత ధృవచరణ్‌కి మరియు హీరో హీరోయిన్‌కి బెస్ట్ విషెస్ అందించారు. అనంతరం మాట్లాడుతూ- దర్శక నిర్మాతలు ఎంతో శ్రమతో, కృషితో సినిమాని నిర్మిస్తారు కానీ సినిమా బాగుంటేనే వాళ్లకి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. మా ఫిలిం చాంబర్ తరఫున ఎప్పుడు వాళ్లకి సహాయ సహకారాలు అందిస్తాము. చిన్న సినిమాలని అందరూ ప్రోత్సహించాలి. ఈ సినిమా హిట్ కావాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు. దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ- ఈ సినిమా కథ శ్రీరంగం సతీష్ సహాయంతో సినిమా మొదలుపెట్టాను. మంచి కామెడీతో రొమాంటిక్‌గా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. వచ్చే నెల జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ- నేను నిర్మాత దర్శకుడిని అయినా కూడా బాలాజీ గారి మీద నమ్మకంతో, సినిమా కథపై నమ్మకంతో మంచి చిత్రం చేయటానికి సన్నాహాలు చేశాం. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను నిర్మించాం. సినిమా చాలా బాగా వచ్చింది. విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అని తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు జయసూర్య ప్రసంగించారు.