నివురు లోగో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవ్, మమతా మోహన్‌దాస్, సునయన హీరో హీరోయిన్లుగా రుషి కృష్ణ దర్శకత్వంలో అభిరామ్ నిర్మించిన చిత్రం ‘నివురు’. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. మా అధ్యక్షుడు శివాజీరాజా లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- మహాదేవ్‌కు చిన్నప్పటినుంచీ సినిమాలపై ఆసక్తి వుంది. అందరి హీరోల పేర్లను పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. సినిమా అంటే అతనికి అంత పిచ్చి. ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తేవాలని కోరుకుంటున్నానన్నారు. హీరో మహదేవ్ మాట్లాడుతూ- చిన్నప్పటినుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. చదువు పెద్దగా అబ్బకపోయినా సినిమా రంగంలో రాణించాలని వచ్చాను అన్నారు. నిర్మాత అభిరామ్ మాట్లాడుతూ- ఈ సినిమా కోసం చాలా కష్టాలు పడ్డాం. తప్పకుండా మా కష్టానికి తగ్గ ఫలితం వుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్.రాజా, కెమెరా: గురు, ఎడిటింగ్: సత్తాజ్, నిర్మాత: అభిరామ్, దర్శకత్వం: రుషికృష్ణ.