సంజునే నమ్ముకుందా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ చిత్రంలో కథానాయికగా నటించిన శియా గౌతమ్ ఎంతమందికి గుర్తుంది చెప్పండి. ఆ తర్వాత అమ్మడు ‘వేదం’ సినిమాలోనూ మనోజ్ బాజ్పాయ్ వైఫ్గానూ కనిపించింది. ఆ తర్వాత శియాగౌతమ్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. తర్వాత కొన్నాళ్ళకి చిన్న చిన్న ఈవెంట్స్లో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. అసలు ఈ అమ్మాయ్ ఎందుకని హీరోయిన్గా మళ్ళీ కనిపించలేదు అని. కట్ చేస్తే.. ‘సంజు’ ట్రైలర్లో శియా తళుక్కున మెరిసింది. సంజయ్దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్కుమార్ హీరానీ దర్శకుడు. రణబీర్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్దత్ చెల్లెలిగా శియాగౌతమ్ నటించింది. సినిమాలో ఆమెది మంచి పాత్రేనట. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో మంచి గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తుంది శియా గౌతమ్.