5న గోపీచంద్ పంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా శ్రీసత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం పంతం. ఫర్ ఏ కాజ్ ఉప శీర్షిక. ఈ సినిమా జూలై 5న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ- మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సురేందర్‌రెడ్డికి థాంక్స్. నేను ఏదైతే కథను నమ్మి సినిమా చేశానో అది రేపు నిజం కానుం ది. అన్నట్టుగానే సినిమాను అద్భుతంగా చేశాడు ప్రసాద్ మూరెళ్ళ. నా 25వ సినిమా మంచి సోషల్ కాజ్ వున్న కమర్షియల్ సినిమా చేశాను. పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ట్రైలర్‌తోపాటు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్ముతున్నాను అన్నారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ పంతం.. ఫర్ ఎ కాజ్ అనే యాప్ట్ టైటిల్‌గా ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నాయి. సామాజిక సమస్యను కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించారు. రాధామలోహన్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రసాద్ మూరెళ్ళ అద్భుతమైన విజువల్స్ సినిమాను ఎంత క్వాలిటీగా ఉండబోతోందో చెబుతోంది. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు అన్నారు. కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ మా బ్యానర్‌లో ఏడో సినిమా. గోపీచంద్‌కు 25వ సినిమా. నాకు అవకాశం ఇచ్చిన గోపీచంద్‌కు థాంక్స్. చక్రవర్తి కొత్త డైరెక్టర్ కదా.. ఎలా చేస్తారోనని చిన్న డౌట్ ఉండేది. కానీ ఆయనతో మూడు నాలుగు డిస్కషన్స్ చేసిన తర్వాత చాలా నమ్మకం కలిగింది. సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు. మెహరీన్ నటించిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయ. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. జూలై 5న సినిమా విడుదల చేస్తున్నాం అన్నారు.