శేఖర్ కమ్ములతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోకుండా ఫిదా చేయించి దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం మరో సినిమా ఒప్పుకుందట సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో హీరోయిన్‌గా పరిచయం అయినా, సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో టాలీవుడ్‌ని ఫిదా చేసింది. ఆ సినిమా తరువాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు తమ ఇంటి అమ్మాయిగా ఫిక్స్ అయ్యారు. తాజాగా మరోసారి శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు ఓకె చెప్పిందట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ క్రేజీ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఓ తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ధృవ్‌ని తెలుగు తెరకు పరిచయం అవుతున్న సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ధృవ్ తెలుగు అర్జున్‌రెడ్డి రీమేక్‌ని తమిళంలో చేస్తున్న విషయం తెలిసిందే. అన్నట్టు ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తాడట. సాయిపల్లవి ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.