12న బేవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి గర్వించదగ్గ ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాసం సమర్పణలో ఎస్‌ఎస్‌కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎం.అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- మొదట్లో ఈ చిత్రానికి బేవర్స్ అనే టైటిల్ ఏంటి అనుకొన్నాను. ఇదే డౌటు ఆడియెన్స్‌కు కూడా వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కానె్సప్ట్‌తో ఈ సినిమా రూపొందించారు. దర్శకుడు రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. సంగీతం కూడా చాలా బాగుంటుంది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తన మనసు, ప్రాణం పెట్టి రాసిన ‘తల్లి తల్లినా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేన శవమల్లే మిగిలానమ్మా..’ అంటూ సాగే అద్భుతమైన సాంగ్ చాలా మంచి హిట్‌గా నిలిచింది అన్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ- మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయితగా ఎంతగా తృప్తి చెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ ఈ పాత్ర ఇప్పటివరకూ చేయకపోవడం నా అదృష్టం. చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అన్నారు.