చెన్నై వరద బాధితులకు టాలీవుడ్ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాల కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెన్నై నగర వాసులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వస్తున్నారు. తాజాగా నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్‌రామ్‌లు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ చెరో రూ.10 లక్షలు, కళ్యాణ్‌రామ్ రూ.5 లక్షలు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందిస్తారు. అలాగే హీరో రవితేజ రూ. 5 లక్షల రూపాయలు, వరుణ్ తేజ్ రూ.3 లక్షలు, విరాళంగా ప్రకటించారు. మరోవైపు ‘3జి లవ్’ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత ప్రతాప్ కోలగట్ల లక్ష, సంపూర్నేష్ బాబు రూ.50 వేలు విరాళాన్ని అందజేశారు.
నా ఇల్లు జలమయం - సిద్దార్థ్
‘చెన్నైలో వర్షాలు భయానక పరిస్థితులు కల్పించాయి. ఎటుచూసినా నీళ్లే. సకల సౌకర్యాలతో ఉన్న నా ఇంట్లోకీ వరదనీరు చేరింది. నేను మేడ పైభాగానికి చేరుకుని ఉండాల్సి వచ్చింది. నాలాంటి వారికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక పేదల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో’ అని హీరో సిద్దార్థ్ ఆందోళన వ్యక్తం చేశాడు.
తన ఇంట్లోకి వచ్చిన వరదనీటి ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సినీరంగానికి చెందినవారు అధికంగా ఉండే ప్రాంతంకూడా వరదనీటితో ముంపునకు గురైంది.