దీక్షితా.. కొత్త సినిమా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇంతకుముందు ‘జంక్షన్లో జయమాలిని’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన ఎమ్ఈ బాబు నిర్మాతగా దీక్షితా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మరో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం ఇటీవల బోరబండలోని ఓ టెంపుల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మరో అతిథి ప్రముఖ నృత్య దర్శకులు శివ సుబ్రహ్మణ్యం మాస్టర్ క్లాప్కొట్టారు. బి.వినాయకరావు కెమెరా స్విచాన్ చేశారు. ఎన్నో చిత్రాలకు పనిచేసిన సీనియర్ ఎడిటర్ నూతలపాటి రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూట్యూబ్ కామెడీ కింగ్గా పేరు తెచ్చుకున్న ఎమ్ఈ బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. యూత్కి నచ్చే కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రముఖ హీరో నటించనున్నారు. హీరోయిన్ని కూడా త్వరలో ఫైనల్ చేసి నెలాఖురులో షూటింగ్ ప్రారంభిస్తాం. కొత్త పాత నటీనటుల కలయికలో సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాత ఎమ్ఈ బాబు చెప్పారు.