మహర్షికి విలన్ దొరికాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్‌లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు సాయికుమార్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. గతంలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘ఎవడు’ చిత్రంలో విలన్‌గా నటించి ఆ పాత్రను రక్తికట్టించారు సాయికుమార్. దాంతో వంశీ మళ్ళీ ఈ చిత్రానికి కూడా ప్రతినాయకుడిగా ఆయనే్న తీసుకున్నారట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపిలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.