యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా త్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా గౌతమ్‌నాయుడు దర్శకత్వంలో పద్మజనాయుడు రూపొందిస్తున్న చిత్రం త్రయం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యువతరం మెచ్చే అంశాలతో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, ముగ్గురు వ్యక్తుల శక్తియుక్తుల నేపథ్యంలో రియలిస్టిక్‌గా ఈ చిత్రం సాగుతుందని అన్నారు. ఎలాంటి రోప్స్, డూప్స్ లేకుండా ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమాకు హైలెట్ అని, ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందించేలా షూటింగ్ చేశామని అన్నారు. హాలీవుడ్‌లో జాకీచాన్ చేసిన రియల్ ఫైటింగ్ సరికొత్తగా షూటింగ్ చేశామని, సెన్సార్‌కు త్వరలో పంపి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: గౌతమ్‌నాయుడు.