తూర్పుగోదావరి

పిడుగుపాటుకు గొర్రెలు, మేకలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 4: మండలంలోని కొమ్మూరు గ్రామ శివార్లలో ఆదివారం పడిన పిడుగుపాటుకు అయిదు గొర్రెలు, రెండు మేకలు మృతిచెందాయి. చట్టి గ్రామానికి చెందిన శ్యామల రంగయ్య, ఉగ్గం దేవయ్యలకు చెందిన గొర్రెలు, మేకలు కొమ్మూరు గ్రామ శివార్లలోని చంద్రవంక వాగు సమీపంలో మేతకు వెళ్లాయి. వర్షం కురియడంతో గొర్రెలు, మేకలు సమీప చెట్టుకిందకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడడంతో ఇవి మృతిచెందాయి. మృతిచెందిన ఈ గొర్రెలు, మేకలు విలువ రూ.50వేలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు.