తూర్పుగోదావరి
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.85 లక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శంఖవరం, అక్టోబర్ 28: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారికి హుండీల ద్వారా రూ.84,81,701 ఆదాయం సమకూరినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు. రత్నగిరిపై గల స్వామివారి నిత్య కల్యాణ మండపంలో దేవస్థానం ఛైర్మన్ ఐవి రోహిత్, ఇఒ కాకర్ల నాగేశ్వరరావు సమక్షంలో దేవస్థానం సిబ్బంది హుండీలను తెరిచారు. 28 రోజులపాటు ఉంచిన హుండీల ద్వారా స్వామివారికి 18 గ్రాముల బంగారం, 650గ్రాముల వెండి, నగదు రూ.80,65,930లు, నాణెములు రూ.4,15,771లు లభించాయ. నగదు విదేశీ కరెన్సీలో యుఎస్ఎకు చెందిన 56డాలర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 15రీమ్లు, ఖతార్ సెంట్రల్ బ్యాంకు 3 రియాల్, సింగపూర్ 2 డాలర్లు, మలేషియా 2 రీమ్లు, సౌదీ అరేబియా 5 రియాల్, నేషనల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎథోపిస్ 5 బిర్,్ర కువైట్కు చెందిన 5 దినార్లు లభించినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు.