తూర్పుగోదావరి

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, నవంబర్ 14: అమలాపురం రూరల్ మండలం పేరూరు వై జంక్షన్ వద్ధ సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని లారీ మోటార్ బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఒక విద్యార్థి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన కరెట్ల సతీష్ (22) మృతి చెందగా అమలాపురంనకు చెందిన గుత్తుల చంద్రశేఖర్, వక్కలంకకు చెందిన కొంకి చైతన్య తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పై ముగ్గురు విద్యార్థులు ఓడలరేవు బివిసి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో కొమరగిరిపట్నం నుండి అయినవిల్లి వినాయకుని గుడికి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా అమలాపురం నుండి బోడసకుర్రు వైపు వెళుతున్న గుర్తుతెలియని లారీ వై జంక్షన్ వద్ధ ఢీకొట్టింది. గాయపడిన విద్యార్థులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.