తూర్పుగోదావరి

అంగరంగ వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 16: అమలాపురంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దంపతులు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం శనివారం ఉదయం 11.12 గంటలకు అశేష జనవాహిని మధ్య స్వామివారి వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని ఆద్యంతం రాజప్ప దంపతులు, ఎమ్మెల్యేలతో పాటు వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు. ఈ కల్యాణ ఉత్సవాల్లో అమలాపురం మున్సిపల్ ఇన్‌ఛార్జి ఛైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎఎంసి ఛైర్మన్ అల్లాడి స్వామినాయుడు, మున్సిపల్ విప్ నల్లా స్వామి, తిక్కిరెడ్డి నేతాజీ, ఛాంబర్ అఫ్ కామర్స్ ఛైర్మన్ గోకరకొండ హరిబాబు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరీ, ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, జడ్పీటిసి అధికారి జయవెంకటలక్ష్మి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచెచ్చట్టి చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.