తూర్పుగోదావరి

హడావుడిగా చెరువు పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, ఏప్రిల్ 28: సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షించనున్న పెద్దపాత్రుని చెరువు పనులను మూఢం ముంచుకు వస్తుండడంతో గురువారం ప్రారంభించేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలో వంద ఎకరాలకు పైగా విస్తీరణం కల్గిన పెద్దపాత్రుని చెరువు అభివృద్ధి చేయడంతోపాటు..వందలాది ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంతో ఈ నెల 26న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ సమక్షంలో వివిధ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమైన విషయం విదితమే. అయితే చంద్రబాబు మే 15వ తేదీలోగా వస్తారని అప్పటి వరకు వేచి ఉంటే ముహూర్తాలు లేవని తెలుసుకున్న నేతలు ఆగమేఘాలపై ముహూర్తం పెట్టించారు. దీంతో గురువారం మాజీ ఎంపిపి జనవపరెడ్డి సుబ్బారావు(బాబు) ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ ఎస్ హరిబాబు పెద్దపాత్రుని చెరువుకు శంకుస్థాపన చేయగా స్థానిక ఎంపిడిఒ కె రత్నకుమారి, ఎంపిపి ఈది రత్నజ్యోతి జ్యోతి ప్రజ్వలన చేశారు. తహసీల్దార్ కె సురేష్‌బాబు, జడ్పీటీసీ పాలూరి బోసుబాబు కొబ్బరికాయలు కొట్టడంతో పనులు ప్రారంభమయ్యాయి.