తూర్పుగోదావరి

టీడీపీ వైఫల్యాలను ఎండగట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోదర్ సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించారు. సునీల్ దియోదర్‌తోపాటు బీజేజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ దియోదర్ మాట్లాడుతూ చంద్రబాబు అవినీతిని ఎండగట్టాలన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో షోకు చేస్తున్న చంద్రబాబు, మరో వైపు కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తున్న నైజాన్ని ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ కార్యకర్తా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ సంఘటనా కార్యదర్శి రవీంద్ర రాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి రేలింగి శ్రీదేవి, అర్బన్ బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు యానాపు ఏసు, నాయకులు ఒంటెద్దు స్వామినాయుడు, సుంకవిల్లి సూర్య, కె మనోజ్, పన్నాల వెంకట లక్ష్మి, అడబాల రామకృష్ణ, ఆకుల శ్రీ్ధర్, ఎం దుర్గారావు, డివిజన్, గ్రామ ముఖ్య నాయకులు హాజరయ్యారు.