అంతర్జాతీయం

మైన్మార్‌లో బోటు మునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగాన్, అక్టోబర్ 17: మైన్మార్‌లో శనివారం తెల్లవారు జామున ఒక బోటు మునిగిపోవడంతో దాదాపు వందమంది గల్లంతయ్యారు. బోటులో 250 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బోటు సామర్థ్యానికి మించి దాదాపు వందమంది వరకూ ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 25 మృతదేహాలను వెలికితీసినట్లు సహాయక సిబ్బంది తెలిపారు.
మొనైవా నగరానికి 72 కి.మీ దూరంలోని చింద్విన్ నదిలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులలో యూనివర్సిటీ విద్యార్థులు, స్కూలు టీచర్లు ఎక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు.
దాదాపు 70 మంది విద్యార్థులు, 30 మంది టీచర్లు, మరికొంతమంది డాక్టర్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే బోటు సిబ్బందిలో నలుగురిని అరెస్టు చేశామని, అయితే బోటు ఓనరు, మరో ఉద్యోగికోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.