అంతర్జాతీయం

అమెరికాలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 17: అమెరికాలోని ఇండియానాపోలీస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ సిక్కు యువకులు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం ఓ చెట్టును ఢీకొంది. ఇండియానాపోలీస్‌లోని ఫిషెర్స్ నగరానికి చెందిన వరుణ్‌దీప్ ఎస్ బ్రింగ్(19), దవ్‌నీత్ ఎస్ ఛాహాల్(22)గా పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం ఎస్‌యూవీ వేగంగా వెళ్తూ చెట్టును ఢీకొందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో దవ్‌నీత్ వాహనాన్ని నడుపుతున్నాడు. అతడు సీట్‌బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గుర్‌జోత్ ఎస్ సంధూ(20)ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఫిషెర్స్ నగరంలో భారతీయ సిక్కులు ఎక్కువ మంది ఉంటారు. ఇద్దరు యువకులు అకాల మృతి చెందడంపై ఆ కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.