అంతర్జాతీయం

ఆధారాలు లేకుండా ఆరోపణలా?: పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 18: యూరీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రవాద దాడి వెనుక తమ హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ తిరస్కరించింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా తమనే అనుమానించడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తింది. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ ప్రత్యక్షంగానే మద్దతిస్తోందని భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించిన మరుక్షణమే పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నఫీజ్ జకారియా తీవ్రంగా స్పందించారు. తమపై భారత్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ‘అసలు దర్యాప్తు చేయకుండా దాడి ఎవరి పనో ఆధారాలు లేకుండా మమ్మల్ని ఏ విధంగా నిందిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. యూరీ ఘటనపై పాకిస్తాన్ పత్రికల్లోనూ, చానళ్లలోనూ విస్తృతంగా కథనాలు వచ్చాయి.