అంతర్జాతీయం
గాయత్రీ మంత్రాలాపన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 March 2017
కరాచీ, మార్చి 17: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైన హోలీ వేడుకల్లో ఓ బాలిక గాయత్రి మంత్రం పఠించి అబ్బురపరిచింది. బుధవారం నాడు కరాచీలో ఉంటున్న హిందువులు హోలీ వేడుకలు నిర్వహించారు. ప్రధాని నవాజ్ షరీఫ్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని పాకిస్తాన్లో మైనారిటీల హక్కుల పరిక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. అలాగే బలవంతపుమత మార్పిళ్లు ఇస్లాంకు పూర్తివ్యతిరేకమని షరీఫ్ అన్నారు. హోలీ వేడుకల్లో నరోధ మాల్నిస్టోలే అనే బాలిక గాయంత్రి మంత్రం పాడి అందర్నీ ఆకట్టుకున్నారు. వేదికపై ఉన్న నవాజ్ షరీఫ్ సహా కార్యక్రమానికి హాజరైన వారంతా చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులు చేశారు.
చిత్రం..కరాచీలో జరిగిన హోలీ వేడుకల్లో గాయత్రి మంత్రం ఆలపించిన ఓ బాలిక