అంతర్జాతీయం

జెరూసలెంలో మళ్లీ ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, జూలై 23: పశ్చిమాసియాలో అత్యంత సమస్యాత్మక పుణ్యక్షేత్రమైన జెరూసలెంలో శనివారం ఇజ్రాయిల్ భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతిచెందారు. జెరూసలెంలో భద్రతా చర్యల విషయమై తలెత్తిన హింసాకాండ సందర్భంగా దాడులకు పాల్పడిన ఒక యువకుడి ఇంటిని ముట్టడించేందుకు ఇజ్రాయిల్ బలగాలు ప్రయత్నించడంతో తాజా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై భద్రతా మండలి సోమవారం జనాంతిక చర్చలను నిర్వహించనుంది. పాలస్తీనాకు చెందిన 19 ఏళ్ల యువకుడు వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు ఇజ్రాయిల్ సెటిలర్లను హత్య చేశాడు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారు.