మంచి మాట

కార్తిక పూర్ణిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక పున్నమికి సంబంధించి- సరస్వతీనదీ పరివాహక ప్రాతంలో కర్మనిష్ఠుడనే యోగిపుంగవుడు శివపూజలు చేస్తుండేవాడు. నిశ్చలంగా ధ్యానచేయడంకోసం అతను ఓసారి శిథిల శివాలయానికివెళ్లి అక్కడున్న ప్రమిదలలో దీపారాధన చేసి ధ్యానం ప్రారంభించాడు. అక్కడే ఆకలితో తిరుగాడుతున్న ఎలుకకు మరో ప్రమిదలో ఆరిపోయిన వత్తి కనిపించింది. దానిని తిందామనుకొని నోట కరుచుకుని పరుగెడుతున్న సమయంలో వెలుగుతున్న దీపం దానికి తగిలి ఆ ఎలుక నోటిలోని వత్తి వెలిగింది. దానితోపాటే ఆ దీపపు వేడికి ఎలుకకు మూతికాలి ప్రాణాలు కోల్పోయంది. ఆ ఎలుక శరీరంలోంచి ఓ దివ్యుడు రూపుదిద్దుకుని కనులు తెరిచాడు. ఎదురుగా ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠునిచూచి తను ఇక్కడికి ఎలా వచ్చాడో తానెవరో కాస్త చెప్పమని అడిగాడు. అపుడు దైవధ్యానంతో కర్మనిష్ఠుడు జరిగింది తెలుసుకొని కార్తిక పూర్ణిమనాడు దీపప్రజ్వలనంతో నీ గతజన్మపాపం భస్మం అయినందువల్ల నీకీజన్మ వచ్చిందని చెప్పాడు. సంకల్పం లేకుండానే వెలిగించిన దీపానికి ఇంత పుణ్యం వస్తే ఇక తెలిసి చేసినవారికి ఎంత పుణ్యమో గదా అనుకున్న ఆ ఎలుకనుంచి వచ్చిన మనిషి వెనువెంటనే శివధ్యాన తత్పరుడయ్యాడు. భక్తేశ్వర వ్రతకథలో తన ఇష్టదైవమైన శివుణ్ణి ప్రార్థించి కుముద్వతి అనే మహిళ అల్పాయుష్కుడైన తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. కనుక స్ర్తిలందరూ తమ మాంగల్య బలంకోసం పార్వతీ పరమేశ్వరాధన చేస్తారు. కోడెదూడను పితృదేవతాప్రీత్యర్థం కార్తిక పున్నమినాడు వదులుతారు. పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో నదులలో అరటిదొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. పరాశక్తికి, శివకేశవులకు పంచభక్ష్యాదులను నివేదన చేస్తారు. కార్తిక పురాణం, వెండి, బంగారం, సాలగ్రామం, భూ, గోదానాలతో పాటు అన్నదానం చేస్తే అధికమైన పుణ్యఫలం లభిస్తుంది. తిరువణ్ణామలైలోని అరుణాచలస్వామి దేవాలయంలో కార్తిక దీపోత్సవాలను ఘనంగా చేస్తారు. కార్తిక పూర్ణిమనాడు బౌద్ధులకు చాతుర్మాస వ్రతసమాప్తి దినం. నేడు బుద్ధుడు తన తల్లి చెంత ఉంటాడని బౌద్ధులు నమ్ముతారు. కార్తిక పున్నమినాడు టపాసులు, మతాబులు కాల్చడం కూడా సంప్రదాయమే.
త్రిపురాసుర సంహారం జరిగిన ఘటనను పురస్కరించుకొని ఈ పున్నమిని త్రిపుర పూర్ణిమగా భావించి త్రిపురాసుర సంహారి అంటూ శివనామస్మరణ చేస్తారు. పార్వతీ మాంగల్యాన్ని కాపాడిన రోజు అని జ్వాలాతోరణాలు నిర్వహిస్తారు. యోగనిద్రనుంచి మేల్కొని తులసీవనానికి విచ్చేసి భక్తులను అలరిస్తున్న మహా విష్ణువును చూచి వైష్ణవాలయాల్లో కార్తికదామోదరుని అర్చనలూ, ఉసిరికను చేర్చి తులసి పూజలు, చేస్తారు. దంపతులు ఈ రోజున సరిగంగ స్నానాలు చేస్తారు. దత్తాత్రేయ జన్మదినంగా కూడా కార్తిక పూర్ణిమను కొన్ని ప్రాంతాలవారు సంభావిస్తారు.
కార్తీక చలిమిళ్ల నోము, కృత్తికా దీపాల నోము, లక్షవత్తుల నోము, లక్ష రుద్రం, వృషవ్రతం, మహీఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరధ పూర్ణిమా వ్రతం లాంటి ఎన్నో నోములను ఈ రోజున స్ర్తిలు నోచుకుంటారు. సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. మున్నూట అరవై వత్తులను వెలిగించడం వల్ల సంవత్సరంలో ఏనాడైనా దీపారాధన చేయకపోవడం వల్ల వచ్చే పాపమేదైనా ఉంటే అది కూడా నశిస్తుంది. అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో దీపాలను వదలడం కార్తిక పున్నమి ప్రత్యేకతనే.
ఆఖరికి కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా దీపారాధన చేసినంత పుణ్యమూ వస్తుంది అంటారు శివభక్తులు. కాశీలో పున్నమినాటి రాత్రి గంగాహారతినిస్తారు. గంగానదిలో దీపాలను వదులుతారు. ఈ రోజు దీపావళిగా కాశీవాసులు సంభావిస్తారు. పల్నాటిసీమలో దీనిని వీరుల పండుగ అంటారు. పౌర్ణమి తిథినాడు జండా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కార్తికమాసంలో నూతనగృహనిర్మాణం, కన్యాదానం చేస్తే ధనధాన్యాభివృద్ధి జరుగుతుందని మత్య్సపురాణం చెబుతుంది

- చరణ శ్రీ