నినే్నచూస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై నూతన నటీనటులు శ్రీకాంత్, హేమలత (బుజ్జి) హీరోహీరోయిన్‌లుగా నాటితరం హీరోయిన్ సుహాసిని, సుమన్, భానుచందర్ ముఖ్యపాత్రలలో వి.ఎస్. ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నినే్నచూస్తు’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. శరవేగంగా రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత హేమలతారెడ్డి మాట్లాడుతూ - ‘‘మా వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌లో ‘నినే్న చూస్తు’ రెండవ చిత్రం. మంచి కుటుంబకథాచిత్రం. సీనియర్ నటులు సుహాసిని, సుమన్, భానుచందర్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సుహాసిని నటించడం మా అదృష్టం. వారు నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. మరొక ముఖ్యపాత్రలో సుమన్ నటిస్తున్నారు. ఆయన మా కుటుంబంలో ఒక భాగంగా కలిసిపోయారు. మొదటి షెడ్యూలు అవుట్‌పుట్ చూశాక చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకొని త్వరలోనే విడుదల చేస్తాం అని అన్నారు. భానుచందర్, సుమన్, కినె్నర, కాశీవిశ్వనాథ్, నిహాల్, వేణు, మహేష్, ఫణీ, రమణ్, జ్యోతిరెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.