అంతర్జాతీయం
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 September 2016
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని మర్దాన్ జిల్లా కోర్టులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరగడంతో 12 మంది చనిపోయారు. 50 మంది గాయపడ్డారు. దాడి తమ పనే అని జమాత్ ఉర్ అహ్రార్ ప్రకటించుకుంది. మరోవైపు పెషావర్ సిటీలో శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కాల్పులు కలకలం సృష్టించడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.