సంజీవని

బాధపెట్టే పార్శ్వపు నొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక.. నిలకడ లేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇలాంటి ఒత్తిడివలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది పార్శ్వపు నొప్పి. దీనినే వైద్య పరిభాషలో మైగ్రేన్ అంటారు. నేడు పార్శ్వపు నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నవారిలో అధికం స్ర్తిలే. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితోపాటు అధిక పనిభారం. పార్శ్వపునొప్పి వలన ఏ పని సరిగా చేయలేక అంతర్గతంగా మధనపడి మానసిక వ్యాధులకు సైతం గురవుతున్నారు. కొందరిలో తలనొప్పి ఒకేవైపునకు వచ్చి వేధిస్తుంది. ఇలాంటి తలనొప్పిని పార్శ్వపునొప్పి (మైగ్రేన్) అంటారు. ఈ నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండా వుండి తల దిమ్ముగా ఉంటుంది.
లక్షణాలు.. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని చేయడం కుదరదు. దీంతో పాటుగా వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, శబ్దాలు భరించలేకపోవడం, వెలుతురును సరిగా చూడలేకపోవుట, కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపించటం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.
కారణాలు.. అధిక మానసిక ఒత్తిడివలన మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిపి మైగ్రేన్ నొప్పి వస్తుంది. మెదడు కణాలలో కణతులు ఏర్పడటంవల్ల కూడా మైగ్రేన్ నొప్పి వస్తుంది. తలకు గాయాలు తగలడం గాని కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌వల్ల కూడా మైగ్రేన్ నొప్పి వస్తుంది. కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడంవల్ల సైతం మైగ్రేన్ నొప్పి వచ్చి వేధిస్తుంది.
జాగ్రత్తలు.. మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామము నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి మైగ్రేన్ నొప్పి తీవ్రత తగ్గుతుంది.
మైగ్రేన్ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు లేని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి.
ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లకు స్వస్తి పలికి పుష్ఠికరమైన ఆహారం తీసుకోవాలి.
ఆకుకూరలకు, వెజిటబుల్స్, తాజా పండ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
నీరు అధికంగా తీసుకోవాలి, వేళకు ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోతూ ఉండాలి.
ప్రతిరోజూ వేకువ జామున లేచి 45 నిముషాలు నడవటం అలవాటు చేసుకోవాలి. తద్వారా రక్తప్రసరణ సక్రమంగా జరిగి మైగ్రేన్ నొప్పి తీవ్రత తగ్గుతుంది.
చికిత్స.. పార్శ్వపు తలనొప్పే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హోమియో వైద్యంలో పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్)కి మంచి చికిత్స ఉంది. ఈ వైద్య విధానంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి యొక్క మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగణనలోకి తీసుకొని మందును ఎన్నుకోవడం జరుగుతుంది. కావున వ్యాధి నివారణ సమూలంగా జరుగుతుంది.
మందులు.. సాంగ్వినేరియా: కుడివైపు వచ్చే పార్శ్వపు తలనొప్పికి ఇది మంచి మందు. తలనొప్పి పోట్లతో కూడి భరించలేకుండా ఉంటుంది. తలనొప్పి వెనుక నుండి ప్రారంభమై ముందుకు వచ్చి తల కుడివైపు భాగంలో ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి వచ్చినపుడు వీరు చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడంవలన ఉపశమనం పొందుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
స్పైజీలియా: ఎడమవైపు వచ్చే పార్శ్వపు తలనొప్పికి ఇది మంచి మందు. తలనొప్పి నుదుటి, కంటి భాగాలలో పోట్లతో కూడి భరించలేకుండా ఉంటుంది. తలనొప్పి వెనుకనుండి ప్రారంభమై ముందుకు వచ్చి తల ఎడమ వైపు కణతల భాగంలో ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి కదిలినా, కుదిపినా ఎక్కువగుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
కాలీబైక్: తలనొప్పి ముక్కు మొదట భాగంలో ప్రారంభమవుతుంది. తలనొప్పి వచ్చే ముందు చూపు మసకబారుతుంది. తరుచుగా జలుబు చేయడంవలన ఇటువంటి తలనొప్పి వస్తుంది. సైనసైటిస్‌తో బాధపడేవారిలో ఈ నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
సైలీషియా: తల వెనుక భాగంలో నొప్పి ప్రారంభమై తలమీదుగా కుడి నుదుటి కంటి భాగంలో ఎక్కువగా ఉంటుంది. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి తల పగిలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు చూపు మసకబారి వస్తువులు సగం వరకే కనిపిస్తాయ. అరికాళ్లలో, అరచేతుల్లో చెమటలు ఎక్కువగా ఉండుట గమనించదగిన లక్షణం. నొప్పి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు భరించలేరు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
ఈ మందులే కాకుండా బ్రయోనియా, జెల్సిమియం, సెపియా, నైట్రోమోర్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నుకొని వైద్యం చేసిన పార్శ్వపునొప్పి (మైగ్రేన్) నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646