శ్రీకాకుళం

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతకవిటి, మే 30: మండలంలోని మోదుగులపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి యజ్జాడ గోపి సోమవారం ఎసిబి అధికారులు జరిపిన దాడిలో చిక్కారు. రూ.2వేలు ఆదే గ్రామానికి చెందిన మజ్జి రాము అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఎసిబి డిఎస్పీ రంగరాజు వెల్లడించారు. ఈ దాడికి సంబంధించి వివరాలివి. ఈ ఏడాది జనవరి 22 తేదీన మోదుగుల పేట గ్రామానికి చెందిన మజ్జి అప్పలనాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం రాము గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నాడు. తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తనకు మంజూరు చేయలేదని రాము తెలిపారు. దీంతో విసుగు చెందిన ఆయన ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఎసిబి అధికారులు ఇచ్చిన సూచనలు మేరకు సంతకవిటి ఎంపిడివో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి గోపికి రూ.2వేలు రాము అందిస్తుండగా అప్పటికే మాటువేసిన ఎసిబి అధికారులు డబ్బులతో సహ పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నారు. అనంతరం ఎంపిడివో కార్యాలయంలో ఎసిబి అధికారులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. దీంతో మండలంలోని ప్రభుత్వ అధికారుల్లో అలజడి ప్రారంభమైంది.