శ్రీకాకుళం

సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.సిగడాం, జూన్ 2: నేటి సమాజంలో సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉత్తరాంధ్రా సాధు పరిషత్ సంఘ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. స్థానిక షిర్డీసాయి ఆలయంలో గురువారం నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్మాన్ని రక్షించడం కోసం భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తున్నారన్నారు. మనస్సును నిగ్రహ శక్తి కలిగి ఉండాలన్నారు. ఈవిశ్వాన్ని నడిపించేది ధర్మమన్నారు. శ్రీరాముని మాట ప్రతీ ఒక్కరు ఆచరించి గ్రామాలను రామనామ సంకీర్తనలతో అయోధ్యగా మార్చేందుకు భక్తులందరూ కృషి చేయాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు రామం మాట్లాడుతూ ప్రతీ నెలల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆయన తెలిపారు.