శ్రీకాకుళం

నయవంచన దీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూన్ 2: రాష్ట్ర విభజనలో తనవంతు పాత్రను నిర్వహించి, నాలుగు పర్యాయాలు విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, నేడు నవనిర్మాణ దీక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా విభజనకు అనుకూలంగా మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నేతలే అంటూ మండిపడ్డారు. ఆనాడు అనుకూలంగా ప్రకటన చేసి, నేడు ఏ విధంగా చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపడతారని ఆమె ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కృష్ణ, గోదావరి నదులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి చంద్రబాబు తన అవినీతి, అక్రమాలపై సిబిఐ కేసు ఉండకూడదనే ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టాక రెండేళ్లు ఆయన చేసిన మంచి, చెప్పుకోదగ్గ పథకాలు ఏమైనా ఉన్నాయంటే అవీలేదని తెలిపారు. బాబు చేసిందల్లా స్కాములే తప్ప అభివృద్ధి లేదన్నారు. సమావేశంలో వైకాపా నేతలు ఎం.వి.పద్మావతి, అంధవరపు సూరిబాబు, సనపల నారాయణరావు, రొక్కం సూర్యప్రకాశరావు, మూకళ్ల తాతబాబు పాల్గొన్నారు.