శ్రీకాకుళం

నిరుద్యోగుల ఫిర్యాదుపై డిప్యూటీ డిఇవో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, జూన్ 2: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ప్రైవేట్ కళాశాల్లో విద్యార్థులను చేర్పించాలని కొంతమంది ఇంటింటా ప్రచారం చేస్తుండడంపై పలువురు నిరుద్యోగులు డిప్యూటీ డిఇవో సత్యానారాయణమూర్తికు ఫిర్యాదు చేశారు. గురువారం మందస మండల రిసోర్స్ కార్యాలయంలో ఆరుగురు ఉపాధ్యాయులు, ఫిర్యాదుదారులు బి.హరికృష్ణ, సింహాచలం, మోహనరావు తదతరులను డెప్యూటీ డిఇవో గురువారం విచారించారు. దీనిపై డెప్యూటీ డిఇవో ఫిర్యాదుదారులు, ఉపాధ్యాయులు నుంచి లిఖితపూర్వకంగా వివరాలను సేకరించారు. దీనిపై తుది నివేదికను డిఇవోకు నివేదిస్తామని తెలిపారు.