శ్రీకాకుళం

వాస్తవాలు వక్రీకరిస్తున్న జగన్: విప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, జూన్ 3: నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, దేశంలోనే ఆంధ్రాను ఆదర్శరాష్ట్రంగా నిలపాలన్న తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందిస్తుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించడం విచారకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. ఆయన పొందూరులో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి వైసిపిని స్థాపించి ఆచరణ బద్దంకానిహామీలతో అమలు పరచలేని వాగ్దానాలతో పార్టీనాయకులను నిరంతరం మభ్యపరుస్తుండటంతో విసుగుచెందిన పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడంవాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకున్న మీదటే తెలుగుదేశంకు పట్టంగట్టారన్న విషయాన్న జగన్ గుర్తుంచుకోవాలన్నారు. తొలుత పొందూరు భారీ నీటి పథకానికి అమర్చిన పైపులైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి శ్రీరాములనాయుడు, మండల దేశం అధ్యక్షుడు రామ్మోహనరావు, అధికారులు పాల్గొన్నారు.