శ్రీకాకుళం

చెక్‌పోస్టుపై ఎసిబి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం, జూన్ 3: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై ఎసిబి అధికారులు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో దాడి చేశారు. అయిదుగురు దళారులను పట్టుకుని వారి నుంచి 27,292 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కౌంటర్‌లో 210 రూపాయలు, వాణిజ్య పన్నుల శాఖ కౌంటర్‌లో 18,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దాడి అనంతరం ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు విలేఖర్లతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న దాడుల్లో భాగంగా ఈ చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా చెక్‌పోస్టు అధికారులు, సిబ్బంది అక్రమంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్సైజ్, భూగర్భ శాఖ కౌంటర్‌ల్లో ఒక్క అధికారి కూడా విధుల్లో లేరని చెప్పారు. మిగిలిన విభాగాల్లో కూడా అధికారులు, సిబ్బంది తగినంతగా లేరన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. దాడిలో సిఐ శ్రీనివాసరావు, 15 మంది సిబ్బంది, ఆర్మిడ్ రిజర్వ్ పోలీసులు పాల్గొన్నారని డిస్పీ చెప్పారు.