శ్రీకాకుళం

సాగునీటి రంగానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావేరు, జూలై 7: ప్రజలకు తాగునీటితోపాటు రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం అన్నారు. గురువారం మండలంలోని చినరొంపివలస గ్రామం లో రూ.9లక్షలతో నిర్మించిన ఆనకట్టను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడారు. ఆయా దిగువ ఆయకట్టు ప్రాంతాలకు ఎంత మేరకు ఈ ఆనకట్టువలన సాగునీరు అందుతుంది అన్నవివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో చేపట్టిన ఇరిగేషన్ పనుల వివరాలను ఎస్ ఇ రవీంద్ర కలెక్టర్‌కు వివరించారు. ఈపర్యటనలో వారి వెంట డి ఇ ఇ గోవిందరావు, ఇరిగేషన్ సిబ్బంది, ఎంపిడివో కిరణ్‌కుమార్; తహశీల్దార్ వెంకటరావు, సర్పంచ్ జగన్నాధం ఉన్నారు.