శ్రీకాకుళం

టిడిపిలో పలువురి చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 8: తెలుగుదేశం పార్టీ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు శుక్రవారం చేరారు. స్థానిక శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాగంగా వారిని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, ఎమ్మెల్యే లక్ష్మీదేవిలు ఆహ్వానించి పార్టీ కండువాను అందజేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్ల 80 శాతం ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, ఇతర పార్టీ నేతల చేరికతో మరింత బలోపేతం కాగలదని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపట్ల ఆకర్షితులై టిడిపి తీర్థం పుచ్చుకోవడం మరింత సంతోషదాయకమన్నారు. వీరి రాకతో ఇప్పటికే పార్టీకోసం అహర్నిశం పనిచేస్తున్న కార్యకర్తలకు ఎటువంటి లోటు ఉండదని, ఎవరికి ఉండాల్సిన గౌరవం వారికి ఉంటుందని పేర్కొన్నారు.
పార్టీలో చేరిన ఇతర పార్టీ నేతల్లో మాజీ కౌన్సిలర్ కెల్ల కొండబాబు, పేర్ల ప్రకాష్, రూరల్, గార మండల నేతలు దుంగ కృష్ణారావు, పొన్నాడ రామారావు, పొట్నూరు కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాసరావు వారి అనుయాయులు ఉన్నారు. కాగా కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శులు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, రూరల్ నేతలు గొండు వెంకటరమణమూర్తి, సీర రమణ; మూకల్ల శ్రీను, గొండు అసిరప్పడు పాల్గొన్నారు.