శ్రీకాకుళం

ఆత్మహత్యాయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచిలి, జూలై 26: మండలంలో మకరాంపురం గ్రామానికి చెందిన ప్రేమికులు వి.రమేష్, స్రవంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో రమేష్(30) మృతి చెందాడు. స్రవంతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితురాలు స్రవంతి చెప్పిన వివరాలివి. రమేష్, స్రవంతిలు 16 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, పదేళ్ళ కిందట స్రవంతి కుటుంబీకులు ప్రేమ వ్యవహరాన్ని అంగీకరించలేదు. తర్వాత తన మేనమామకు ఇచ్చి పెళ్లి చేశారు. అయినప్పటికి రమేష్‌తో ప్రేమ వ్యవహారం సాగించింది. ఇక రమేష్‌కు అయిదేళ్ళ కిందట పెళ్ళి జరిగింది. దీంతో వీరి మధ్య దూరం పెరిగింది. ఆరు మాసాల కిందట గుట్టుగా రమేష్, స్రవంతి ఓ దేవాలయంలో పెళ్ళి చేసుకున్నారు. నెల రోజులు కిందట ఈ విషయం రమేష్ ఇంట్లో తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం 10 గంటలకు దగ్గరలో ఉన్న జీడితోటకు వెళ్లి పురుగుమందు తాగారు. స్రవంతి తన తల్లిదండ్రులకు నేను చనిపోతున్నానని చెప్పడంతో హుటాహుటిన తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని, సోంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురానికి తరలించారు. కొనఊపిరితో ఉన్న రమేష్‌ను సోంపేట ప్రభుత్వాసుపత్రికి రమేష్ అన్నయ్య సురేషు తరలించారు. అయితే, రమేష్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. రమేష్ బావ కల్యాణ్‌కుమార్ తన బావమరిది రమేష్‌ను స్రవంతి తల్లిదండ్రులు చంపారని ఆరోపిస్తున్నాడు. మృతుడు అన్నయ్య సురేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.