శ్రీకాకుళం

గిరిజన బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, జూలై 26: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సవర శిరీష(11) అనే గిరిజన విద్యార్థిని మంగళవారం మృతి చెందింది. ఈ నెల 18వ తేదీన బాలిక పాఠశాలలోనే అనారోగ్యానికి గురైంది. పాఠశాల హెచ్‌ఎం సీతంపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మరుచటి రోజున పాప తండ్రి సురేష్ పాఠశాలకు వచ్చి అనారోగ్యంతో ఉన్న శిరీషను స్వగ్రామమైన బుడ్డోడుగూడ గ్రామానికి తీసుకెళ్లినట్టు హెచ్‌ఎం తెలిపారు. అయితే బాలిక పరిస్థితి ఎప్పటికీ కుదురుపడకపోవడం, అనారోగ్యం తీవ్రం అవ్వడంతో మంగళవారం మృతి చెందినట్టు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ సంఘటన తెలుసుకున్న ఐటిడిఎ పిఒ గ్రామాన్ని సందర్శించి విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించారు. దహన సంస్కారాలు నిమిత్తం ఐటిడిఎ తరుపున రూ.5 వేలును కుటుంబ సభ్యులకు అందించారు.