శ్రీకాకుళం

మత్స్యకారుడు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జూలై 31: మండలం బందరువానిపేటలో ఆదివారం మధ్యాహ్నం తెప్ప బోల్తా పడి మత్స్యకారుడు గల్లంతైయ్యాడు. సహచరులు, బాధిత కుటుంబీకులు తెలియజేసిన వివరాలు మేరకు ఆదివారం వేకువజామున గ్రామానికి చెందిన శివకోటి శ్రీరాములు (60)తో సహా సహచరులు తెప్పపై సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. చేపల వేట పూర్తి చేసుకొని మధ్యాహ్నం పనె్నండు గంటలు సమయంలో తిరిగి వస్తుండగా ఎగిసి పడుతున్న అలలకు వీరు ప్రయాణిస్తున్న తెప్ప బొల్తాపడింది. ఈ సంఘటనలో సహచరులు ప్రమాదం నుండి బయటపడినప్పటికీ శ్రీరాములు జాడ తెలియరాలేదు.
సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని వివిధ విభాగాల అధికారులకు తెలియజేసామని స్థానిక మత్స్యకార నాయకుడు గుంటు లక్ష్మయ్య తెలిపారు.