కృష్ణాష్టమితో కొత్తతరహా కామెడీ -- సునీల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘నా జీవితంలో చేసిన చిత్రాలన్నిటికంటే భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం ఇది. దర్శకుడు, నేను కలసి కొత్తగా కామెడీని ఎలా పండించాలని, ఎలా తీస్తే బావుంటుందో ఆలోచించి ఈ చిత్రాన్ని చేశా’నని కథానాయకుడు సునీల్ తెలిపారు. నిక్కీగల్రాని, డింపుల్ చోపడే కథానాయికలుగా సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో రాజు రూపొందించిన ‘కృష్ణష్టామి’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు.
నిర్మాత రాజు మాట్లాడుతూ సినిమా విడుదలై ఇప్పటికి ఆరు రోజులు కావస్తోందని, రెవెన్యూపరంగా పూర్తి సంతోషంగా వున్నామని, ఈ చిత్రంకోసం సునీల్ పూర్తి ఎఫర్ట్పెట్టి పనిచేశారని, మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులకు నచ్చుతోందని, అన్ని కేంద్రాల్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో సాగుతోందని తెలిపారు. మాస్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ వల్లనే మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్గా నిలిచిందని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలని ఆయన అన్నారు. ఈ సినిమా విజయం గురించి తెలియగానే అప్పటిదాకా వున్న టెన్షన్ మరచిపోయానని, రోజు రోజుకీ కలెక్షన్లు పెరుగుతుండడం ఆనందాన్నిస్తోందని దర్శకుడు వాసువర్మ తెలిపారు.
ఫస్ట్ఫాను క్లాస్ ప్రేక్షకులు ఇష్టపడుతుంటే, సెకండాఫ్ను మాస్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, ఎదుటివారి ముఖంలో సంతోషం చూడడానికి ఎంత దూరమైనా వెళ్లొచ్చు అనే అంశంతో చిత్రీకరించిన ఈ సినిమాకు సునీలే హైలెట్గా నిలిచారని ఆయన అన్నారు. కార్యక్రమంలో డింపుల్చోపడే, నిక్కీగల్రానీ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.