విజయవాడ

కలెక్టర్ బాబుకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: జిల్లా కలెక్టర్ బాబు ఎ బదిలీ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు సర్కిల్ జనరల్ మేనేజర్ జిఎన్‌వి కృష్ణారావు, రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి ఎజిఎమ్ బాలభాస్కర్, విజయవాడ జోనల్ ఆఫీస్ ఎజిఎం ఎమ్‌వి స్వామి కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఇంటివద్దనే సామాజిక భద్రతా పింఛను పంపిణీ పథకం, నగదు రహిత రేషన్ సరుకుల పంపిణీ, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడంలో బాబు ఎ అకుంఠిత దీక్షతో వ్యవహరించి జిల్లాకు, రాష్ట్రానికి ఎనలేని గుర్తింపు, ప్రధాని మోదీ చేతుల మీదుగా ఉత్తమ కలెక్టర్ పురస్కారం పొందిన విషయాన్ని గుర్తు చేస్తూ కలెక్టర్‌ను సత్కరించారు.

నాట్స్ సభకు సిఎం బాబుకు అహ్వానం
బెంజిసర్కిల్, ఏప్రిల్ 21: జూన్ నెలలో జరిగే నార్త్ అమెరికా తెలుగు సంఘం సభలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని నాట్స్ అధ్యక్షుడు మన్నవ కృష్ణమోహనకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అహ్వానించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సిఎం బాబును కలిసిన అధ్యక్షుడు మన్నవ, నాట్స్ షికాగో సంబరాల సమన్వయకర్త రవి అచంట ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు అహ్వాన పత్రికను అందజేశారు. జూన్ 30 నుండి జూలై 2 వరకు షికాగోలో జరిగే నాట్స్ సభలకు ముఖ్యఅతిథిగా తప్పకుండా పాల్గొనాలని వారు అహ్వానించారు. అలాగే అమెరికాలో ప్రమాదంలో మరణించిన బలిక ప్రియాంక గోగినేని కుటుంబ సభ్యులకు నాట్స్ చేస్తున్న ఆర్థికసాయాన్ని సిఎం చేతులు మీదాగా ప్రియాంక తండ్రికి పదిలక్షల 80 వేల రూపాయల చెక్‌ను అందజేశారు.

సర్వీస్ టాక్స్ మినహాయింపు ఇవ్వండి
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 21: నగర పాలక సంస్థ వసూలు చేసే సర్వీస్ టాక్స్ విషయంలో నగరంలోని వస్తవ్య్రాపారులకు మినహాయింపు ఇవ్వాలని విజయవాడ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపూడి రఘురామ్, కార్యదర్శి బొగ్గారపు నరసింహరావు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌ను కోరారు. ఈసందర్భంగా శుక్రవారం కౌన్సిల్ భవనంలోని మేయ ర్ ఛాంబర్‌లో కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు సర్వీస్ టాక్స్‌పై మినహాయింపు ఇవ్వడంతోపాటు వస్తల్రత కాంప్లెక్సులో మరుగుదొడ్ల అభివృద్ధి, ఇతర వౌలిక సదుపాయాలను కల్పించాలని వారు కోరారు. ఈసందర్భంగా వస్తల్రత దుకాణాల వ్యాపారులు విఎంసికి చెల్లించాల్సిన అద్దె బకాయిలు చెల్లింపులో భాగంగా 2కోట్ల 59లక్షల ఒక వెయ్యి 515ల చెక్కును విఎంసి ఇన్‌చార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ సమక్షంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌కు అందజేశారు. ఈకార్యక్రమంలో టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, విఎంసి ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.