విజయవాడ

బైక్ ఢీకొని వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూన్ 2: అతివేగంగా వస్తున్న బైక్ ఢీకొనటంతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడిలో నివాసముంటున్న గజ్జెల దేవసహాయం అంధుడు. అతని భార్య సుబ్బులు (55) గురువారం సాయంత్రం పైపుల రోడ్డు సెంటర్ నుండి జక్కంపూడి రోడ్డుకి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా నగరం నుండి పాయకాపురానికి బైక్ వస్తున్న టి వెంకట సుబ్బారావు అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్ నుండి వేగంగా వచ్చి సదరు దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో భర్త దేవసహాయానికి స్వల్ప గాయాలుకాగా భార్య సుబ్బులుకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సదరు బాధితురాలిని ఢీకొన్న వ్యక్తే 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి వెంకట సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.