విజయవాడ

దుర్గగుడి ఆదాయం రూ. 2.41 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 2: ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధి శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో గురువారం ఉదయం ఇన్‌చార్జ్ ఇవో అజాద్ ఆదేశాల మేరకు సిబ్బంది హుండీలను లెక్కించగా 2కోట్ల, 41లక్షల, 49వేల, 644రూపాయలు లభించాయి. 31 రోజులుగాను అమ్మవారి సన్నిధిలో ఉన్న 50హుండీలను లెక్కించగా ఈ నగదు దేవస్థానానికి మూలధనంగా లభించాయి. ఈకార్యక్రమంలో దేవస్థానం సహాయ ఇవోలు బి వెంకటరెడ్డి, డి సాయిబాబానాయుడు, పర్యవేక్షణాధికారులు యన్ రమేష్, కె విజయ్‌కుమార్, కె చంద్రశేఖర్, అమృతరావు, గోపిచంద్, సిబ్బంది పాల్గొన్నారు.