విజయవాడ

తాజా, మాజీ డిజిపిలకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 24: పోలీసుశాఖలో సుదీర్ఘకాలం విశేష సేవలందించిన మాజీ డిజిపి జాస్తి వెంకట రాముడు దంపతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సత్కరించారు. ఇదే సమయంలో రాష్ట్ర నూతన డిజిపి నండూరి సాంబశివరావు దంపతులను కూడా ఆయన సన్మానించారు. వీరిద్దరిని సతీసమేతంగా ఆదివారం ఉండవల్లిలోని తన నివాస గృహానికి సీఎం ఆహ్వానించారు. విశ్రాంత డిజిపి రాముడు దంపతులకు ఆయన శాలువా కప్పి సత్కరించారు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలని ఈసందర్భంగా రాముడు దంపతులకు సూచించారు.
అదేవిధంగా నూతన డిజిపిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నండూరి సాంబశివరావు దంపతులను కూడా ముఖ్యమంత్రి శాలువాతో సన్మానించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో రాజీ పడరాదని సూచించారు. అంతకుముందు జెవి రాముడు, నండూరి సాంబశివరావు ఇరువురితో ముఖ్యమంత్రి సమావేశమై పలు విషయాలపై చర్చించారు.