విజయవాడ

నవరత్నాలు నచ్చే వైసీపీలోకి వచ్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచనతోనే తాము వైసీపీలోకి చేరినట్లు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ల నేతృత్వంలో సీఎం జగన్ సమక్షంలో అవినాష్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షతో జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రారంభించారని, ఆ పథకాలు నచ్చేపార్టీలో చేరానని దేవినేని అవినాష్ స్పష్టంచేశారు. నవరత్నాలతో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, అవే తనను పార్టీలో చేరేలా ప్రభావితం చేశాయన్నారు. నేటి నుంచి తన అనుచరవర్గం మొత్తం జగన్ వెంట నడుస్తుందని, తనను కుమారుడిలా ఆదరించి పార్టీలోకి ఆహ్వానించిన సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో జగన్మోహనరెడ్డి బలపర్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామన్నారు.