విజయవాడ

దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), ఆగస్టు 27: దళితుల అభ్యున్నతికోసం అవిరళ కృషి చేసిన దార్శినికుడు అయిన అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకుని దళితులు ముందుకు సాగాలని కేంద్ర మాజీ మంత్రి ఎంపి జెడి శీలం అన్నారు. ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్, ఎపి ఆధ్వర్యంలో మాదిగలు నేడు రేపు పుస్తకావిష్కరణ శనివారం సాయం త్రం గాంధీనగరంలోని ఒక హోటల్‌లో జరిగింది. ఈ పుస్తకంపై విశే్లషణ, చర్చ, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాదిగ మహిళలు, యువకులు, బాలల సాధికారత అంశంపై, దేశాభివృద్ధిలో మాదిగల స్థానం అంశంపై విశే్లషణ- చర్చ జరిగింది. వీటిలో టికెఎస్‌ఆర్ ఠాగూర్, ప్రొ.కొలకలూరి ఐనాక్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, మాజీ జడ్‌పి ఛైర్మన్ నల్లగట్ల సుధారాణి, కె.రామ్మోహనరావు (ఐఎఎస్), ఎస్.సరళా వందనం, ప్రొఫెసర్ స్వరూపరాణి, డాక్టర్ ఎం.రాంబాబు, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వహణ గెడ్డం బాపిరాజు, మట్టా విద్యార్థి తదితరులు చేశారు.