విజయవాడ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలుర మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఆగస్టు 28: సూర్యరావుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణలంకకు చెందిన గూడపాటి నోయల్‌కుమార్ (17) బాలుడు రైతుబజారుకు సైకిల్‌పై బయలుదేరుతూ కృష్ణలంకకే చెందిన గోర్ల జగదీష్‌చంద్ర (13)ను తోడుగా తీసుకెళ్లాడు. దారిలో తమ సైకిల్ స్నేహితుని వద్ద ఉంచి అతని వద్ద ఉన్న మోటార్ బైక్‌ను తీసుకెళ్లారు. బందరురోడ్డు రంగా విగ్రహం దాటాకా భారత్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించి రాంగ్‌రూట్‌లో రైతుబజారు వైపు వస్తున్నారు. అదే సమయంలో కృష్ణలంకకే చెందిన అద్దెపల్లి నోయల్‌కుమార్ (20) బైక్‌ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో అద్దెపల్లి నోయల్‌కుమార్ రోడ్డు పక్కకు పడిపోగా గూడపాటి నోయల్‌కుమార్, జగదీష్ చంద్రలు రోడ్డు మధ్యలోనే పడ్డారు. ఇదే సమయంలో నున్న నుంచి వస్తున్న 48 సిటీ బస్సు జగదీష్‌చంద్ర, గూడపాటి నోయల్‌కుమార్ మీదుగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బాలురు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన సూర్యరావుపేట పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని తీవ్రగాయాల పాలైన అద్దెపల్లి నోయల్‌కుమార్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగదీష్‌చంద్ర, గూడపాటి నోయల్‌కుమార్‌ల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు నోయల్‌కుమార్ కెబిఎన్ కాలేజీ ప్రాంగణంలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. జగదీష్ చంద్ర కృష్ణలంకలోని గీతాంజలి స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. మృతుల కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గుండెలు అరిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చటం ఏవరి తరం కావటంలేదు.