విశాఖ

ఇద్దరు గంజాయి స్మగ్లర్లకు పది సంవత్సరాల జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, నవంబర్ 23: గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పినట్టు స్థానిక ఎస్.ఐ. ఉమామహేశ్వరరావు విలేఖరులకు తెలిపారు. గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి రవాణా చేస్తున్న 66 కిలోల గంజాయిని గత సంవత్సరం డిసెంబర్ నెలలో తాము ఘాట్ రోడ్డు జంక్షన్ వద్ద పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. గంజాయితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్ధుల్ ఆలీం, ముఖేష్ సోనిలు పట్టుబడగా వీరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం గంజాయి తరలిస్తున్నట్టు నిర్థారణ కావడంతో ఇద్దరు స్మగ్లరైన అబ్ధుల్ ఆలీం, ముఖేష్ సోనిలకు పది సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్టు ఆయన చెప్పారు.

గంజాయి మొక్కలు ధ్వంసం
డుంబ్రిగుడ, నవంబర్ 23: మండలంలోని కొర్రా పంచాయతీ చెట్టిబంద, పెద్దపాడు గ్రామాలలో గంజాయి తోటలను గురువారం ఎక్సైజ్ ప్రత్యేక బృందం ధ్వంసం చేసారు. ఈ గ్రామాల కొండ ప్రాంతాలలోని 25 ఎకరాలలో సాగు చేస్తున్న లక్షా 25 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.