విశాఖ

జివిఎంసి ప్రత్యేక అధికారిగా యువరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఏప్రిల్ 28: జివిఎంసి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు పట్టణ పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న కరికాల వలవన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన విధానాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతోపాటు సులభతరమైన పాలన అందించేందుకు జిల్లా కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో కలెక్టర్, కమిషనర్ అత్యంత కీలకమైన పాత్ర పోషించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక అధికారి సేవలు కీలకం కానుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. కాగా పాత పద్ధతిలోనే తిరిగి కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడంతో పరిపాలన సులభతరం కానుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.