విశాఖ

22న అమ్మకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం టౌన్, జనవరి 20: మండలంలోని అన్ని హైస్కూళ్లలో ఈనెల 22న అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎం ఈవో సాయి శైలజ తెలిపారు. విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో 22న వశంత పంచమి సందర్భంగా మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రం చేపడుతున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమానికి తల్లిదండ్రులు అందరూ హాజరు కావాలన్నారు. వారి పిల్లలచే తల్లులు అందరికీ పాదాభిషేకం, పాదాభివందనం చేయిస్తామన్నారు. తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థుల తల్లులను సన్మానిస్తామన్నారు. అమ్మ గొప్పదనంపై వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ అమ్మకు వందనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.