విశాఖ

బ్యాడ్ మింటన్ విజేత విజయనగరం స్టీల్ జైంట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 20: టీవీజీ భరత్ ఆంధ్రా బ్యాడ్ మింటన్ లీగ్ 2018 టైటిల్ విజయనగరం స్టీల్ జైంట్స్ కైవసం చేసుకుంది. విశాఖ పోర్టు ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోటీలోల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజయనగరం స్టీల్ జైంట్స్ జట్టు సినర్‌జీస్ వైజాగ్ స్మాషర్స్ జట్టుపై 3-2 సెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా మెన్స్ సింగిల్స్‌లో సినర్జీస్ వైజాగ్ జట్టు 15-0, 15-9 పాయింట్లు సాధించి 0-1 తేడాతో గెలుపొందింది. ఉమన్స్ సింగిల్స్‌లో సినర్జీస్ వైజాగ్ జట్టు విజయనగరం స్టీల్ జైంట్స్‌పై 15-6, 15-12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మెన్స్ డబుల్స్ పోటీలో సిజర్జీస్ వైజాగ్ జట్టు స్టీల్ జైంట్స్‌తో హోరాహోరీ పోరాడింది. ఈ పోటీలో తొలి సెట్‌ను 15-11 పాయింట్ల తేడాతో సినర్జీస్ వైజాగ్ కైవసం చేసుకోగా, రెండోసెట్‌ను స్టీల్ జైంట్స్ జట్టు 9-15 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠ భరితంగా సాగిన మూడో సెట్‌లో సినర్జీస్ వైజాగ్ జట్టు 15-9 పాయింట్ల తేడాతో గెలిచి సెట్‌లు గెలుచుకుంది. బాయ్స్ సింగిల్స్‌లో స్టీల్ జైంట్స్ జట్టు 15-8, 15-7 పాయింట్ల తేడాతో గెలిచింది. చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో విజయనగరం స్టీల్ జైంట్స్ జట్టు, వైజాగ్ స్మాషర్స్ జట్టుపై 15-12, 15-11 పాయింట్లతో గెలిచి ఐదు మ్యాచ్‌లను 3-2 తేడాతో గెలిచింది. పోటీలను పోర్టు చైర్మన్ ఎంటీ కృష్ణబాబు ప్రారంభించారు.